అక్షరటుడే, బోధన్: Urea Farmers Protest | ప్రభుత్వం యూరియాను సకాలంలో అందించట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బోధన్ మండలం (Bodhan Mandal) ఏరాజ్పల్లిలో గురువారం ధర్నా నిర్వహించారు.
Urea Farmers Protest | యూరియా గోదాం వద్ద..
గ్రామ రైతు నడిపి గంగారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో కొన్నిరోజులుగా యూరియా సరైన రీతిలో అందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత లేకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రైతాంగం రోడ్డుపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
యూరియా యాప్తో కష్టాలు..
యూరియా కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్తో అనేక కష్టాలు వస్తున్నాయని రైతులు ఆరోపించారు. ఎప్పుడు లేని ఆన్లైన్ యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం (State Government) యూరియా అమ్మాకాలు చేపడుతుండడంతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇది వరకు ఉన్నట్లుగానే యూరియా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.
