Homeజిల్లాలునిజామాబాద్​Mann Ki Baat | 'మన్ కీ బాత్'ను వీక్షించిన అర్బన్ ఎమ్మెల్యే

Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ను వీక్షించిన అర్బన్ ఎమ్మెల్యే

ప్రధాని నరేంద్ర మోదీ మన్​ కీ బాత్​ కార్యక్రమాన్ని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా వీక్షించారు. తన కార్యాలయంలో ఆదివారం కార్యకర్తలతో ఆయన కార్యక్రమాన్ని తిలకించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Mann Ki Baat | ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) 127వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal) ఆదివారం తన కార్యాలయంలో వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశాభివృద్ధి దిశగా తీసుకుంటున్న ప్రగతిశీల నిర్ణయాలను ప్రధాని ప్రజలకు వివరిస్తున్నారని తెలిపారు.

ఐదేళ్ల తర్వాత భారత్-చైనా(Chaina) మధ్య విమాన సేవలు పునరుద్ధరించడం కారణంగా వాణిజ్యం పెరుగుతుందన్నారు. పర్యాటక రంగం పెరిగి సత్సంబంధాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్దార్ వల్లభ్​ భాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. ప్రధాని మన్ కీ బాత్ దేశ ప్రజల్లో జాతీయతాభావం సేవ స్ఫూర్తి పర్యావరణ చైతన్యాన్ని పెంపొందిస్తుందని వెల్లడించారు.