HomeతెలంగాణCabinet Expansion | ఆగని మంత్రి పదవుల రగడ.. ఎమ్మెల్యే కవ్వంపల్లి దంపతుల కీలక వ్యాఖ్యలు

Cabinet Expansion | ఆగని మంత్రి పదవుల రగడ.. ఎమ్మెల్యే కవ్వంపల్లి దంపతుల కీలక వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cabinet Expansion | మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampalli Satyanarayana) దంపతులు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎమ్మెల్యే బర్త్​ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి అనురాధ మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని తొక్కేశామని కొందరు సంతోష పడుతున్నారు. కవ్వంపల్లి (Kavvampalli) ఎంత తొక్కితే అంత ఎదుగుతారు” అని వ్యాఖ్యానించారు. “రాష్ట్ర స్థాయిలో తన సేవలు అవసరం లేదని ఆ దేవుడు అనుకున్నాడేమో” అని సత్యనారాయణ అన్నారు.

రాష్ట్రంలో ఇటీవల మూడు మంత్రి పదవులను (ministerial posts) భర్తీ చేసిన విషయం తెలిసిందే. పదవుల భర్తీకి ముందు కేబినెట్​లో (Cabinet) తమకు అవకాశం కల్పించాలని మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు సీఎంతో పాటు అధిష్టానాన్ని కలిసి విన్నవించారు. ఈ మేరకు మాదిగ సామాజిక వర్గం నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్​కుమార్​కు (Adluri Laxman Kumar) మంత్రి పదవి కేటాయించారు. అయితే ముందు కవ్వంపల్లి సత్యనారాయణకు (Kavvampalli Satyanarayana) మంత్రి పదవి కన్ఫర్మ్​ అయినట్లు వార్తలు వచ్చాయి. తీరా లక్ష్మణ్​కుమార్​కు మినిస్టర్​ పోస్ట్​ ఇవ్వడంతో కవ్వంపల్లి దంపతులు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మంత్రి పదవి ఆశించి భంగపడ్డవారు అలకబూనిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డిని (MLA Malreddy Ranga Reddy) పీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్​, మంత్రి శ్రీధర్​భాబు బుజ్జగించారు. బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డికి (Bodhan MLA Sudarshan Reddy) మంత్రి పదవి రాకపోవడంతో కాంగ్రెస్​ నాయకులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. మంగళవారం నియోజకవర్గంలో నిరసనలు తెలిపారు.