అక్షరటుడే, మెండోరా/ఎల్లారెడ్డి: Irrigation projects | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
Irrigation projects | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు (Sriram Sagar Project) వరద కొనసాగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు గురువారం 4 వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి ప్రస్తుతం 21,954 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 650 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. కాకతీయ (Kakatiya Canal), లక్ష్మి కాలువకు నీటిని నిలిపేశారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో, ఔట్ఫ్లో గురువారం సమానంగా ఉంది. ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు పోతోంది. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం అంతేస్థాయిలో నీరు నిల్వ ఉంది.
Irrigation projects | నిజాంసాగర్లో..
నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి (Nizamsagar Project) ఎగువ నుంచి ఇన్ఫ్లో క్రమం తప్పకుండా వస్తోంది. జలాశయంలోకి ప్రస్తుతం 9,570 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు 12 గేట్లకు గాను 2 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. అంతే మొత్తంలో జలాశయంలో నీటినిల్వ ఉంది.
