అక్షరటుడే, వెబ్డెస్క్: Bandi Sanjay | సీఎం రేవంత్(CM Revanth)కు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. ఫీజు రీయింబర్స్మెంట్(Fees reimbursement)పై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రీయింబర్స్ రాక కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కారణంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే అనేక కాలేజీలు(Colleges) మూతపడ్డాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం(State Government) వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
