HomeతెలంగాణNizamabad City | కెనాల్​లో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

Nizamabad City | కెనాల్​లో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad City | నగరంలోని నిజాంసాగర్​ కెనాల్​లో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆరో టౌన్​ ఎస్​హెచ్​వో వెంకట్రావు (6th Town SHO Venkat Rao) తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారులోని డెయిరీ ఫామ్​ కమాన్​ వద్ద ఉన్న నిజాంసాగర్​ కెనాల్​లో శుక్రవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించారు.

కాలువలో పడి మృతి చెందిన వ్యక్తి మగవ్యక్తిగా గుర్తించామని ఎస్​హెచ్​వో తెలిపారు. సుమారు 40 ఏళ్లు ఉంటాయని.. ఆనవాళ్లు లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరికైనా మృతుడి సమాచారం తెలిస్తే ఆరో టౌన్​ పోలీస్​స్టేషన్​(6th Town Police Station)లో సంప్రదించాలని వారు కోరారు.

మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షం(Heavy Rain) కారణంగా కెనాల్​లో మరో ప్రాంతం నుంచి మృతదేహం కొట్టుకొచ్చిందా.. లేక ఎవరైనా ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెంది ఉంటారా.. అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Must Read
Related News