Homeజిల్లాలుకామారెడ్డిGandhari | వ్యక్తి దారుణహత్య.. పెట్రోల్​ పోసి నిప్పంటించిన దుండగులు

Gandhari | వ్యక్తి దారుణహత్య.. పెట్రోల్​ పోసి నిప్పంటించిన దుండగులు

పెట్రోల్​ పోసి ఓ గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గాంధారి మండలంలో చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, గాంధారి: Gandhari | ఉమ్మడి జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఆర్మూర్​ పట్టణంలో (Armoor Town) మంగళవారం భార్యను భర్త (husband) అనుమానంతో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు.

తాజాగా.. గాంధారి మండలంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తిని పెట్రోల్​ పోసి హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలంలోని (Gandhari mandal) చద్మల్​కు వెళ్లే శివారులో గుంతలో ఓ వ్యక్తిని పెట్రోల్​ పోసి నిప్పటించి హత్య చేసినట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి డీఎస్పీ శ్రీనివాస్​, సదాశివనగర్​ సీఐ సంతోష్​కమార్​, ఎస్సై ఆంజనేయులు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కామారెడ్డి జీజీహెచ్​ (Kamareddy GGH) మార్చురీకి తరలించారు. క్లూస్​టీం, డాగ్​ స్వ్కాడ్​తో పరిశీలన చేశారు. మృతుడి వయస్సు 30 ఏళ్లు ఉంటుందని.. సమాచారం నిమిత్తం గాంధారి పోలీస్​స్టేషన్​లో 8712686165 నంబర్​ను సంప్రదించాలని పోలీసులు కోరారు.