Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | ట్రాక్టర్​ను ఢీకొన్న గుర్తు తెలియని లారీ.. నలుగురికి గాయాలు.. ఇద్దరికి సీరియస్

Kamareddy | ట్రాక్టర్​ను ఢీకొన్న గుర్తు తెలియని లారీ.. నలుగురికి గాయాలు.. ఇద్దరికి సీరియస్

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | గణపతి నిమజ్జనం (Ganpati immersion) కోసం ట్రాలీ ట్రాక్టర్​ను తీసుకెళ్తుండగా లారీ ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జాతీయ రహదారిపై (Kamareddy National Highway) క్యాసంపల్లి శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. దోమకొండకు (Domakonda) చెందిన యువకులు రామారెడ్డి నుంచి గణపతి ట్రాలీని (Ganpati trolley) తీసుకుని వెళ్తున్నారు. ట్రాక్టర్ ఇంజన్​పై నలుగురు యువకులు కూర్చున్నారు. ట్రాలీ బైపాస్ రోడ్డుపై క్యాసంపల్లి శివారులోకి రాగానే వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని లారీ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొంది. ఈ ఘటనలో ట్రాక్టర్ ఇంజన్​పై కూర్చున్న నలుగురికి గాయాలయ్యాయి. దోమకొండకు చెందిన సాయికుమార్, శ్రీధర్​లతో పాటు ట్రాక్టర్ నడుపుతున్న రాజయ్యకు గాయాలయ్యాయి. ఇందులో శ్రీధర్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ రిఫర్ చేశారు. మరొక యువకుని సైతం నిజామాబాద్​కు రిఫర్ చేసినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Must Read
Related News