Homeజిల్లాలునిజామాబాద్​Yedapally | పెళ్లింట విషాదం.. ఉరేసుకుని పెళ్లికొడుకు ఆత్మహత్య

Yedapally | పెళ్లింట విషాదం.. ఉరేసుకుని పెళ్లికొడుకు ఆత్మహత్య

పెళ్లింట్లో విషాదం నెలకొంది. పెళ్లికొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎడపల్లిలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Yedapally | పెళ్లింట్లో ఊహించని విషాదం నెలకొంది. ఒక రోజులో పెళ్లి ఉండగా.. పెళ్లికొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఎడపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఎడపల్లి ఎస్సై రమ (Yedapally SI Rama) తెలిపిన ప్రకారం.. ఎడపల్లి మండలం మంగళ్​పాడ్​ గ్రామానికి చెందిన ప్రతాప్​గౌడ్​కు ఈనెల 13వ తేదీ పెళ్లి జరగాల్సి ఉంది.

అయితే ప్రతాప్​ గౌడ్​ రెండురోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబీలకు అతడి కోసం తీవ్రంగా గాలించారు. గ్రామశివారులో బుధవారం ప్రతాప్​గౌడ్​ ఉరి వేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు (family members) సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఎడపల్లి ఎస్సై రమ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Must Read
Related News