- Advertisement -
HomeతెలంగాణJakranpalli | పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువతులు దుర్మరణం

Jakranpalli | పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువతులు దుర్మరణం

- Advertisement -

అక్షరటుడే, డిచ్​పల్లి: Jakranpalli | పరీక్ష రాసి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి చెందిన ఘటన జక్రాన్​పల్లి మండలం అర్గుల్​ (Argul)​ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ (Nirmal)​ జిల్లా పెంబి గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు బానోత్​ మంజుల, బానోత్​ అశ్విని హైదరాబాద్​లో (Hyderabad) శుక్రవారం ఎంసెట్​ పరీక్ష రాసేందుకు గ్రామానికి చెందిన హంసరాజుతో వెళ్లారు. అనంతరం కారులో ముగ్గురు హైదరాబాద్​ నుంచి నిర్మల్​కు తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యలో జక్రాన్​పల్లి మండలం అర్గుల్​ గ్రామ శివారులోని మైత్రి ఫంక్షన్​ హాల్ (Maitri Function Hall)​వద్ద కారు అదుపుతప్పి కల్వర్టు​ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువతులు మంజుల, అశ్విని అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ హంసరాజును 108 అంబులెన్సులో జిల్లా కేంద్రంలోని జీజీహెచ్​కు తరలించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News