HomeUncategorizedIndian Army | ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం.. చొర‌బాటుకు య‌త్నిస్తుండ‌గా కాల్చేసిన సైన్యం

Indian Army | ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం.. చొర‌బాటుకు య‌త్నిస్తుండ‌గా కాల్చేసిన సైన్యం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army | భార‌త్‌లోకి చొర‌బ‌డేందుకు య‌త్నిస్తున్న ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను Two terrorists భ‌ద్ర‌తాబ‌ల‌గాలు కాల్చి చంపాయి. జమ్మూ కాశ్మీర్‌లోని Jammu and Kashmir బారాముల్లాలో Baramulla జరిగిన భారీ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు terrorists మరణించారని ఇండియన్ ఆర్మీ తెలిపింది. అనంత్‌నాగ్ జిల్లాలోని anantnag district పహల్గామ్‌లో Pahalgam మంగ‌ళ‌వారం జ‌రిగిన దారుణ‌మైన‌ ఉగ్రవాద దాడి జరిగిన మ‌రుస‌టి రోజే ఈ ఈ ఆపరేషన్ జరిగింది.

బారాముల్లాలోని Baramulla ఉరి నాలా వద్ద సర్జీవన్ జనరల్ ప్రాంతం గుండా దాదాపు ఇద్దరు-ముగ్గురు ఉగ్రవాదులు terrorists చొరబడటానికి ప్రయత్నించగా ఎన్‌కౌంటర్ encounter ప్రారంభమైందని భారత సైన్యం Indian Army తెలిపింది. “భద్రతా దళాలు, ఉగ్రవాదుల terrorists మధ్య భారీ కాల్పులు జరిగాయి, ఇద్దరు ఉగ్రవాదులను మ‌న ద‌ళాలు కాల్చి చంపాయి. బారాముల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్‌లో భద్రతా దళాలు Security forces చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేశాయి” అని పేర్కొంది.ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర వ‌స్తువుల‌ను సైనిక‌లు స్వాధీనం చేసుకున్నారు.

Indian Army | ప‌హ‌ల్గామ్‌లో ఊచ‌కోత‌

జమ్మూ కాశ్మీర్‌లోని Jammu and Kashmir పహల్గామ్‌లోని Pahalgam ఉగ్ర‌వాదులు దారుణ మార‌ణ‌కాండ‌కు పాల్ప‌డ్డారు. ప‌ర్యాట‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ప్ర‌ధానంగా హిందువుల‌నే Hindus టార్గెట్‌గా చేశారు. ప‌ర్యాటకులు పేర్లు అడుగుతూ, ఖురాన్ Quran చ‌ద‌వ‌మ‌ని చెబుతూ ప్రాణాలు తీశారు. ఈ ఘోరమైన దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ దారుణం జ‌రిగిన తర్వాత రోజే బారాముల్లోలా ఈ ఎన్‌కౌంటర్ encounter జరిగింది.