Homeజిల్లాలునిజామాబాద్​kammarpally | చేపలవేటకు వెళ్లిన వారికి విద్యుత్​షాక్​.. ఇద్దరు మృతి

kammarpally | చేపలవేటకు వెళ్లిన వారికి విద్యుత్​షాక్​.. ఇద్దరు మృతి

- Advertisement -

అక్షరటుడే, కమ్మర్​పల్లి: kammarpally | చేపలవేటకు వెళ్లిన ఇద్దరు విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఈ విషాదకర ఘటన కమ్మర్​పల్లిలో బుధవారం చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని గాంధీనగర్​కు (Gandhi Nagar) చెందిన ఇద్దరు వ్యక్తులు కొండపల్లి లక్ష్మణ్​, సిత్తరి నర్సింలు అనే ఇద్దరు వ్యక్తులు కమ్మర్​పల్లి జాతీయ రహదారి పక్కన కుంటలో చేపల వేటకు వెళ్లారు.

అయితే అక్కడ వారిద్దరికి విద్యుత్​షాక్​ (Electric shock) కొట్టింది. దీంతో వారిరువురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సమాచారం అందుకున్న పోలీసులు (kammarpally Police) సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.