ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | రెండు లారీలు ఢీ: ఒకరి దుర్మరణం

    Kamareddy | రెండు లారీలు ఢీ: ఒకరి దుర్మరణం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి రామారెడ్డి(Ramareddy) సమీపంలో చోటుచేసుకుంది.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నుంచి సిద్దిపేట వెళ్లాల్సిన ఓ లారీ పొరపాటున రామారెడ్డి బైపాస్ వంతెన నుంచి సర్వీస్ రోడ్డులోకి దిగింది. వెంటనే తప్పుదారిలో వెళ్తున్నామని గుర్తించిన డ్రైవర్ బైపాస్ పైకి లారీ(Lorry)ని మళ్లించాడు. అదే సమయంలో వెనుక నుంచి హైదరాబాద్(Hyderabad) వైపు వెళ్తున్న లారీ వేగంగా ఈ లారీని ఢీకొట్టింది. దీంతో హైదరాబాద్ వెళ్తున్న వెళ్తున్న లారీ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని మధ్యప్రదేశ్ కు చెందిన ఓంకారం పార్తీ(33) గా గుర్తించారు. గాయపడ్డ మరో ఇద్దరిని ప్రస్తుతం కామారెడ్డి జీజీహెచ్(Kamareddy GGH) కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...