Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!
Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణలో (Telangana) మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు చేరబోతున్నాయి. అది కూడా హైదరాబాద్​లోనే వాటి ఏర్పాటుకు శ్రీకారం చుడుతోంది కేంద్ర ప్రభుత్వం.

భారత్​లో అత్యవసరంగా కావాల్సిన కీలక ఖనిజాలపై జరగనున్న పరిశోధనల నిమిత్తం కేంద్ర సర్కారు ఏడు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. వీటిల్లో రెండు హైదరాబాద్​కే దక్కడం విశేషం. ఈ రెండింటిలో IIT హైదరాబాద్​(IIT Hyderabad)లో ఒకటి, హకీంపేట్‌(Hakimpet)లో ఉన్న – NFTDC (Non-Ferrous Technology Development Centre)లో మరోటి ఏర్పాటు చేస్తోంది.

Critical Minerals : అరుదుగా లభించే మినరల్స్ పై…

ఫ్యూచర్‌కి కావాల్సిన పవర్​, స్పేస్‌ లాంచ్‌లు, బ్యాటరీలు, డిఫెన్స్ టెక్నాలజీలు ప్రత్యేకమైన మినరల్స్‌ మీద ఆధారపడి ఉంటాయి. ఆ ప్రత్యేకమైన వాటినే క్రిటికల్ మినరల్స్ గా పేర్కొంటారు. ఈ క్రిటికల్​ మినరల్స్ అరుదుగా దొరుకుతాయి.

Critical Minerals : తీవ్ర డిమాండ్​..

ఈ క్రిటికల్​ మినరల్స్ కు ప్రపంచ వ్యాప్తంగా భారీగా డిమాండ్​ ఉంది. ముఖ్యంగా అగ్ర రాజ్యాలు వీటి కోసం పోటీ పడుతుంటాయి. ఎందుకంటే ఎవరి వద్ద ఎక్కువగా ఇవి ఉంటే.. వారిదే పై చేయిగా భావిస్తుంటారు.

అందుకే భారత్​ కూడా వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్​కు శ్రీకారం చుట్టింది. ఈ మిషన్‌ కోసం బడ్జెట్లో రూ. 16,300 కోట్లు కేటాయించింది. ఇంకో రూ.18,000 కోట్లు పీఎస్‌యూ(PSU)ల నుంచి తీసుకోనుంది. ఈ మేరకు మొత్తం IITలు, సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్లతో కలిసి హార్డ్‌కోర్ పరిశోధన చేయబోతోంది. ఇందులో భాగంగా తెలంగాణకు రెండు కేంద్రాలు రాబోతున్నాయి.

ఈ కేంద్రాల ఏర్పాటుతో ఈ రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. పరిశోధనా ఫలాలు అందనున్నాయి. స్టార్టప్​ అవకాశాలు కలగనున్నాయి. మొత్తానికి వీటికి ప్రధాన మార్గంగా మారనున్నాయి.