అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ( Nizamabad Police Commissionerate) పరిధిలో ఇద్దరు ఏఎస్సైలకు పదోన్నతి లభించింది. ఏఎస్సైలు బి.బాలశౌరి రాజు, దయాల్ సింగ్లకు ఎస్సైలుగా ప్రమోషన్ వచ్చింది.
దీంతో సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారికి బ్యాడ్జిలు అలకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రమోషన్ ద్వారా విధుల్లో మరింత బాధ్యత పెరుగుతుందని అన్నారు. ఉత్తమ సేవలు అందించాలని వారికి సూచించారు.