HomeతెలంగాణPolice Promotions | ఇద్దరు ఏఎస్సైలకు సబ్​ ఇన్​స్పెక్టర్లుగా పదోన్నతి

Police Promotions | ఇద్దరు ఏఎస్సైలకు సబ్​ ఇన్​స్పెక్టర్లుగా పదోన్నతి

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Police Promotions | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో ఇద్దరు ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఈమేరకు రాష్ట్ర డీజేపీ (Telanagana DGP) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎస్సైలు సీపీ సాయిచైతన్యను (CP Sai Chaitanya) మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీ వారికి బ్యాడ్జీలను అందజేశారు.

గత కొంతకాలంగా ప్రమోషన్ల ఎదురుచూస్తున్న ఏఎస్సైలకు ప్రమోషన్లు రావడంతో వారిలో ఆనందం వ్యక్తమైంది. మాక్లూర్(makloor)​ పీఎస్​ ఏఎస్సై గంగాధర్ ఎస్సైగా ప్రమోషన్​ పొంది జగిత్యాలకు (jagityal) ట్రాన్స్​ఫర్​ అయ్యారు. అలాగే నగరంలోని ఐదోటౌన్​ ఏఎస్సై రమేష్​ ఎస్సైగా ప్రమోషన్ పొంది నిర్మల్​కు (Nirmal) బదిలీపై వెళ్లారు.

Police Promotions | కమిషనరేట్​ పరిధిలో ప్రమోషన్లు

నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీసులకు ప్రమోషన్లు దక్కాయి. నేడు ఇద్దరు ఏఎస్సైలకు పదోన్నతి లభించగా.. ఇప్పటికే జిల్లాలో తొమ్మది మంది కానిస్టేబుళ్లకు సైతం హెడ్​కానిస్టేబుళ్లుగా (Head constables) ప్రమోషన్​ లభించిన విషయం తెలిసిందే.

Must Read
Related News