అక్షరటుడే, వెబ్డెస్క్ : Double Bed Room Houses డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్ (Qutubullahpur) ఎమ్మెల్యే వివేకానందగౌడ్ (MLA Vivekananda Goud) అనుచరలమని, బీఆర్ఎస్ కార్యకర్తలమని చెప్పుకుంటూ ఇద్దరు వ్యక్తులకు ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి జి శ్రీధర్, ప్రదీప్ ప్రసాద్ అనే వ్యక్తులను ప్రజల నుమచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతేగాకుండా ఇళ్లు మంజూరు చేసినట్లు నకిలీ లేఖలు వారికి అందజేశారు. అయితే ఎంతకు ఇల్లు రాకపోవడంతో కె మల్లేశ్వరి అనే మహిళ జి శ్రీధర్పై ఈ నెల 23న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీధర్తో పాటు అతడికి సహకరిస్తున్న ప్రదీప్ను సోమవారం సుచిత్ర (Suchitra)లో అరెస్ట్ చేశారు.
Double Bed Room Houses | ఎమ్మెల్యే పేరు చెప్పి..
నిందితులు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. తమకు ఎమ్మెల్యే వివేకానందగౌడ్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రజలను నమ్మించేవారు. రాజకీయ నాయకులతో ఉన్న ఫొటోలను ప్రజలకు చూపించేవారు. తమకు డబ్బులు కడితే డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తామని నమ్మ బలికేవాడు. ప్రాసెసింగ్, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర ఖర్చులు ఉంటాయని డబ్బులు వసూలు చేసేవారు. అనంతరం బాధితులకు నకిలీ మంజూరు పత్రాలు (Fake Letters) జారీ చేసేవారు. ఈ క్రమంలో ఓ మహిళ ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నకిలీ లేఖలు, కారు, ల్యాప్టాప్, కంప్యూటర్, వెబ్క్యామ్, ప్రింటర్, స్కానర్, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Double Bed Room Houses | ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ సహాయకుడు అరెస్ట్
డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు సహాయకుడిని ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జులై 23న బోడిమి శెట్టి హరిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని హరిబాబు 84 మంది నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేసినట్లు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇల్లు మంజూరు చేయకపోగా.. డబ్బులు సైతం తిరిగి ఇవ్వలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ ఇళ్ల వ్యవహారంలో ముగ్గురు అరెస్ట్ కావడం తీవ్ర చర్చకు దారి తీసింది.