Homeజయశంకర్ భూపాలపల్లిBhupalpally | విద్యార్థులకు అస్వస్థత ఘటనలో ట్విస్ట్​.. నీళ్లలో పురుగుల మందు కలిపిన టీచర్​

Bhupalpally | విద్యార్థులకు అస్వస్థత ఘటనలో ట్విస్ట్​.. నీళ్లలో పురుగుల మందు కలిపిన టీచర్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhupalpally | విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయుడు క్రమశిక్షణ తప్పాడు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన సార్​.. మరో టీచర్​పై కోపంతో విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలు ఆడాడు. తాగునీటీలో మోనో అనే పురుగుల మందు కలిపాడు. దీంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనప జయశంకర్​ భూపాలపల్లి(Bhupalpally) జిల్లాలో చోటు చేసుకుంది.

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్​లో అర్బన్​ రెసిడెన్షియల్​ పాఠశాల(Urban Residential School) ఉంది. పాఠశాలలో కలుషిత నీటిని తాగి శుక్రవారం 13 మంది విద్యార్థులు అస్వస్థతకు (Food Poison) గురయ్యారు. దీంతో సిబ్బంది వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. శుక్రవారం ఉదయం టిఫిన్​ చేశాక.. స్టీల్‌ క్యాన్‌లో నిల్వ చేసిన నీటిని తాగిన విద్యార్థులు(Students) అనారోగ్యానికి గురయ్యారు. పలువురు కడుపు నొస్తుందని చెప్పగా.. మరికొంత మంది వాంతులు చేసుకున్నట్లు ప్రిన్సిపాల్​ వెంకన్న(Principal Venkanna) తెలిపారు.

Bhupalpally | విచారణలో వెలుగులోకి

విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుకున్న డీఈవో రాజేందర్(DEO Rajender)​, సీఐ నరేష్‌కుమార్(CI Naresh Kumar) తదితరులు పాఠశాలను పరిశీలించారు. నీటి నమూనాలు సేకరించి ల్యాబ్​కు పంపించారు. ఆ నీటిని పరీక్షించిన ల్యాబ్​ సిబ్బంది అందులో మోనో మందు కలిపినట్లు తెలిపారు. దీంతో అధికారులు విచారణ చేపట్టగా సైన్స్​ టీచర్​ రాజేందర్(Science Teacher Rajender) మందు కలిపాడని విద్యార్థులు తెలిపారు. ప్రిన్సిపాల్‌తో గొడవ పడి వాటర్ ట్యాంకు(Water Tank)లో తానే మందు కలిపినట్లు రాజేందర్​ ఒప్పుకున్నాడు.

తనపై అనుమానం రాకుండా రాజేందర్​ కూడా ఆ నీళ్లు తాగాడు. ప్రిన్సిపాల్, టీచర్ల మధ్య గొడవల కారణంగానే నీళ్లలో మోనో మందు కలిపినట్టు రాజేందర్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయన సైతం అస్వస్థతకు గురయ్యాడు. 13 మంది విద్యార్థులు ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడిన సదరు టీచర్​పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.