HomeతెలంగాణHyderabad | ఒక్కసారిగా పేలిన టీవీలు, ఏసీలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Hyderabad | ఒక్కసారిగా పేలిన టీవీలు, ఏసీలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | దసరా అయిపోవడంతో కుటుంబ సభ్యులు సరదాగా ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా టీవీలు, ఏసీలు పేలిపోయాయి. మూడు ఇళ్లలో సడెన్​గా పేలుడు చోటు చేసుకోవడంతో ఆయా ఇళ్లలోని వారు ఆందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

హైదరాబాద్(Hyderabad)​ నగరంలోని సుచిత్రలో గల వసంత్ విహార్ కాలనీ(Vasant Vihar Colony)లోని పలు ఇళ్లలో శుక్రవారం ఎలక్ట్రానిక్​ వస్తువులు పేలిపోయాయి. ఒకదాని తర్వాత ఒకటి చొప్పున వస్తువులు పేలడంతో ఏం జరుగుతుందో తెలియక ఆయా ఇళ్లలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మొత్తం మూడు ఇళ్లలో ఏసీలు, టీవీలు ​పేలాయి. హై వోల్టోజీ(High Voltage) కారణంగా పేలుడు చోటు చేసుకుందని భావించారు. వెంటనే తేరుకొని ఇతర ఎలక్ట్రానిక్​ వస్తువలకు కరెంట్​ సరఫరా నిలిపి వేశారు. అనంతరం విద్యుత్​ శాఖ అధికారులకు(Electricity Department Officers) సమచారం ఇచ్చినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. కాగా హై వోల్టేజీతో టీవీలు, ఏసీలు పేలిపోలేదని తేలింది. స్తంభాలకు ఉన్న విద్యుత్​ తీగలు ఎర్త్ అవ్వడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిసింది.