ePaper
More
    Homeఅంతర్జాతీయంBOYCOTT TURKEY | తుర్కియేకు షాక్.. యూనివర్సిటీ బప్పందాన్ని రద్దు చేసిన JNU

    BOYCOTT TURKEY | తుర్కియేకు షాక్.. యూనివర్సిటీ బప్పందాన్ని రద్దు చేసిన JNU

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: BOYCOTT TURKEY | పహల్​గామ్​​ ఉగ్రదాడి(Pahalgaon terror attack) తర్వాత పాకిస్తాన్​​పై భారత్ ఆపరేషన్​ సిందూర్(Operation Sindoor) చేపట్టింది. దీంతో ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ సమయంలోనే పాకిస్తాన్ (Pakistan) ​కు తుర్కియే మద్దతు ఇవ్వడంపై భారతదేశంలో ​తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

    ఇప్పటికే తుర్కియేకు ఆన్‌లైన్‌ బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు మన ట్రావెల్‌ ఏజెన్సీలు ప్రకటించాయి. ఈ క్రమంలోనే తుర్కియేలోని ఇనొను యూనివర్సిటీ(Inonu University)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు తాజాగా ఢిల్లీ(Delhi)లోని ప్రఖ్యాత జేఎన్‌యూ(JNU) ప్రకటించింది.

    దేశ భద్రత దృష్ట్యా ఇనొను యూనివర్సిటీ (Inonu University)తో కుదుర్చుకున్న ఎంవోయూను నిలిపేస్తున్నట్లు జేఎన్‌యూ సీనియర్‌ అధికారి చెప్పారు. ఈ ఒప్పందంలో అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడికి సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరుదేశాల వర్సిటీల మధ్య ఇటీవల మూడేళ్ల కాల పరిమితికి విద్యాపరమైన ఒప్పందం కుదిరింది.

    READ ALSO  Himachal Pradesh | హిమాచల్‌లో వింత వివాహం.. ఒకే అమ్మాయిని మనువాడిన అన్నదమ్ములు

    తుర్కియేలోని మలట్యా(Malatya)లో ఇనొను యూనివర్సిటీ ఉంది. విభిన్న సాంస్కృతిక పరిశోధనలు, విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ఇటీవల జేఎన్‌యూ, ఇనొను వర్సిటీల మధ్య ఎంవోయూ కుదిరింది. తాజా పరిణామాల నేపథ్యంలో సదరు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ జేఎన్‌యూ నిర్ణయం తీసుకుంది.

    తుర్కియేలో కొన్నేళ్ల క్రితం భూకంపం(earthquake) వచ్చింది. ఆ సమయంలో భారత్​ తక్షణం స్పందించి, అన్నివిధాలా సాయం అందించింది. కానీ, పహల్​గామ్​ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్​కు బుద్ధి చెప్పేందుకు ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor)తో భారత్ దాడి చేసింది.

    కానీ, ఈ సమయంలో పాక్‌కు తుర్కియే బాంబు డ్రోనులను సరఫరా చేసింది. మిలిటరీ సిబ్బందిని కూడా పంపించింది. దీంతో ఆగ్రహించిన ప్రజలు బాయ్‌కాట్‌ తుర్కియే(Boycott turkey) పేరుతో సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా తుర్కియే వస్తువులు, పర్యాటకాన్ని బహిష్కరించాలన్న డిమాండ్లు ఉన్నాయి.

    READ ALSO  Parliament Sessions | పార్ల‌మెంట్‌లో వాయిదాల ప‌ర్వం.. నిమిషానికి రూ.2.50 ల‌క్ష‌ల ప్ర‌జాధ‌నం వృథా

    ఇప్పటికే తుర్కియే ఆన్​లైన్ బుకింగ్​లను నిలిపివేశారు. మరోవైపు మహారాష్ట్ర(Maharashtra)లోని పుణె (Pune) వ్యాపారులు తుర్కియే నుంచి వచ్చే యాపిల్స్​ను సైతం పూర్తిగా బహిష్కరించారు. తుర్కియే యాపిల్స్​ను దిగుమతి చేసుకోవడం మానేశారు. అలా పుణె మార్కెట్ యార్డు (Pune market yards) ల్లో తుర్కియే యాపిల్స్ కనుమరుగయ్యాయి. రానున్న రోజుల్లో తుర్కియేతో భారత్​ వాణిజ్య సంబంధాలు సైతం తగ్గే అవకాశాలు లేకపోలేదు.

    Latest articles

    Fertilizers | ఎరువుల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్​

    అక్షరటుడే, బోధన్: Fertilizers | ఎడపల్లి (Ydapalli) మండల కేంద్రంలోని సింగిల్ విండో సొసైటీ గోదాంను (Single Window...

    Telangana University | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​ కాలేజీ !

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Telangana University | ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad)​ జిల్లా విద్యార్థుల కల నెరవేరబోతుంది. అన్ని...

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....

    Bharosa Center | మహిళలు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | బాధిత మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని సీపీ...

    More like this

    Fertilizers | ఎరువుల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్​

    అక్షరటుడే, బోధన్: Fertilizers | ఎడపల్లి (Ydapalli) మండల కేంద్రంలోని సింగిల్ విండో సొసైటీ గోదాంను (Single Window...

    Telangana University | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​ కాలేజీ !

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Telangana University | ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad)​ జిల్లా విద్యార్థుల కల నెరవేరబోతుంది. అన్ని...

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....