అక్షరటుడే, వెబ్డెస్క్ : TTD Laddu Case Verdict | టీటీడీ లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి (Former MP Subramanian Swamy) వేసిన పిటిషన్పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.
వేంకటేశ్వర స్వామి (Venkateswara Swamy) భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై గతంలో సుప్రీంకోర్టు సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ విచారణ (SIT Investigation) కొనసాగుతుండగా.. ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది. దీనిపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది.
TTD Laddu Case Verdict | వార్త కథనాల ఆధారంగా..
తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) పంపిణీ చేసిన ప్రఖ్యాత తిరుమల లడ్డూల చుట్టూ జరిగిన అవకతవకలను దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు గతంలో ఏర్పాటు చేసిన సిట్ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం బలహీనపరుస్తుందని స్వామి వాదించారు. సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూత్రా వాదిస్తూ.. పిటిషనర్ వాదనలను తోసిపుచ్చారు. పరిపాలనా చర్యను ఆలస్యం చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. వార్తాపత్రిక నివేదికల ఆధారంగా పిటిషన్ వేశారన్నారు.
పిటిషనర్ దాఖలు చేసిన మరో కేసులో దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) జోక్యం చేసుకోకుండా నిరోధించడానికి తక్షణ రిట్ దాఖలు చేయబడిందని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. తిరుమలలో ప్రసాదం లడ్డూల కల్తీకి సంబంధించిన వివాదామని పేర్కొన్ఆరు. కల్తీ నెయ్యి (Adulterated Ghee)ని ఉపయోగించడం ద్వారా ప్రసాదం పవిత్రత గురించి కొన్ని ప్రకటనలు చేయబడ్డాయన్నారు. దీనిపై దర్యాప్తును అక్టోబర్ 2024లో సుప్రీంకోర్టు ఉత్తర్వులోని పేరా 9లో ఉన్న అధికారులు/ఏజెన్సీలతో కూడిన సిట్కు అప్పగించారని గుర్తు చేశారు. అయితే ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది.
