అక్షరటుడే, వెబ్డెస్క్ : TTD Chairman | టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) సాక్షి టీవీ, సాక్షి పత్రికపై పరువు నష్టం దావా వేశారు. సాక్షి మీడియాలో ఈ నెల 10, 14 తేదీల్లో తనపై నిరాధార వార్తలు ప్రచురించారని ఆయన ఆరోపించారు. ఆయా వార్తలతో తన ప్రతిష్టకు భంగం కలిగించారన్నారు.
అంతేగాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి (Sakshi) మీడియా తనకు క్షమాపణా చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీకి రూ.10 కోట్లు చెల్లించాలన్నారు. రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయాలంటూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు టీటీడీ ఛైర్మన్ ఫిర్యాదు చేశారు.