Trump Tariffs Suspended | రేపటి నుంచి నిలిచిపోనున్న ట్రంప్​ టారిఫ్​లు

పలు దేశాలపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు రేపటి నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Trump Tariffs Suspended | ప్రతీకార సుంకాల పేరుతో ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) విధించిన టారిఫ్​లను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయా టారిఫ్​లను ఈ నెల 24 నుంచి వసూలు చేయమని అమెరికా కస్టమ్స్‌ విభాగం తెలిపింది.

ట్రంప్​ టారిఫ్​లు (Trump Tariffs) చట్ట విరుద్ధమని కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. న్యాయస్థానం మూడు రోజుల క్రితం టారిఫ్​లను రద్దు చేసినా.. అమెరికా ప్రభుత్వం మాత్రం వాటిని వసూలు చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం నుంచి సుంకాల వసూలును నిలిపి వేస్తామని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద విధించిన సుంకాల వసూళ్లను మంగళవారం ఉదయం 12:01 గంటలకు నిలిపివేస్తామని US కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (Border Protection) ఏజెన్సీ తెలిపింది.

Trump Tariffs Suspended | 15 శాతం టారిఫ్​లు

అమెరికా (America) ఆయా దేశాలపై విధించిన సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ట్రంప్​ వాటిని భర్తీ చేయడానికి 15 శాతం టారిఫ్​లు విధించారు. వేరే చట్టపరమైన అధికారం కింద కొత్తగా 15 శాతం గ్లోబల్ టారిఫ్‌ను విధించారు. కాగా భారత్​పై గతంలో 50 శాతం సుంకాలను ట్రంప్​ విధించారు. ఇటీవల వాణిజ్య ఒప్పందం తర్వాత అది 18శాతానికి తగ్గినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఆ సుంకాలు కూడా ఉండవు. అయితే గ్లోబల్​ టారిఫ్​ (Global Tariff) పేరుతో 15 శాతం సుంకాలు అన్ని దేశాలపై అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సుంకాలను మంగళవారం నుంచి అమలు చేస్తామని ట్రంప్​ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు. దీంతో గ్లోబల్​ టారిఫ్​లు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయన్నది ఇంకా తెలియరాలేదు. గ్లోబల్ టారిఫ్​లు అమలులోకి వస్తే భారత్​పై సుంకాలు 50 శాతం నుంచి 15శాతానికి తగ్గనున్నాయి.

Related articles

Kamareddy Land Dispute | రాజకీయ లబ్ధి కోసమే కళాశాల ఆస్తుల వివాదం: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి

రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి కళాశాల ఆస్తుల వివాదాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే కేవీఆర్​ అన్నారు. కలెక్టరేట్​లో సోమవారం ఆయన కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Delhi Bomb Threat | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు

ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఎర్రకోటతో పాటు రెండు పాఠశాలల్లో బాంబు పెట్టినట్లు దుండగులు మెయిల్​ పంపారు.

ASHA Workers Arrest | సీఐటీయూ, ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్​

బాన్సువాడ పట్టణంలో సీఐటీయూ నాయకులను, ఆశకార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Soumya Government Job | ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.