అక్షరటుడే, వెబ్డెస్క్ : Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల భారత్పై 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 25 శాతం టారిఫ్స్ అమలులోకి రాగా.. ఈ నెల 27 నుంచి మరో 25 శాతం అమలులోకి రానున్నాయి. వీటి ప్రభావంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఫలితంగా భారత కంపెనీల (Indian Company) నుంచి ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. అయితే ట్రంప్ తాజాగా భారతీయులకు బంగారం లాంటి శుభవార్త చెప్పారు.
టారిఫ్లతో (Tariffs) భయపెడుతున్న ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ వేదికగా మంగళవారం కీలక ప్రకటన చేశారు. బంగారంపై ఎలాంటి సుంకం విధించమని ఆయన ప్రకటించారు. ఇటీవల ట్రంప్ టారిఫ్లు విధించడంతో బంగారంపై కూడా సుంకాలు పెంచుతారని వార్తలు వచ్చాయి. దీంతో బంగారం ధరలు (Gold Rates) భారీగా పెరిగాయి. అయితే తాజాగా ట్రంప్ బంగారాన్ని సుంకాల యుద్ధం నుంచి దూరంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
Donald Trump | ధరలు తగ్గే అవకాశం
వారం రోజులుగా ట్రంప్ బంగారంపై సుంకాలు విధిస్తారనే ఊహాగనాలు వినిపిస్తున్నాయి. దీంతో రేట్లు పెరిగాయి. అయితే ట్రంప్ స్వయంగా బంగారంపై సుంకాలు విధించమని పోస్ట్ చేయడంతో పుకార్లకు తెరపడింది. బంగారంపై సుంకం ఉంటుందనే వార్తల నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెట్టేవారు, బంగారం వ్యాపారులు ఆందోళన చెందారు.
మరోవైపు భారతీయులు (Indians) బంగారు ఆభరణాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. సుంకాలు విధిస్తే భారత్పై తీవ్ర ప్రభావం ఉండేది. అయితే ట్రంప్ తాజా నిర్ణయంతో గత కొంతకాలంగా పెరుగుతున్న బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. కాగా ట్రంప్ ఇటీవల భారత్, బ్రెజిల్ లాంటి దేశాలపై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నామనే కారణంతో సుంకాలు విధించారు. అయితే బంగారంపై సుంకాలు లేవని ప్రకటించడంతో బంగారం వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగితే తమ వ్యాపారంపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన చెందారు.

