అక్షరటుడే, ఇందూరు: TRSMA | తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు ప్రైవేటు పాఠశాలల (Private Schools) యాజమాన్య సంఘం (ట్రస్మా) నిజామాబాద్ (Nizamabad) నూతన కార్యవర్గం ఎన్నికైంది. నూతన అధ్యక్షుడిగా సుందర్ (శ్రీ భాషిత పాఠశాల ఆర్మూర్), జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనుముల క్రాంతి (ఆర్కిడ్ పాఠశాల నిజామాబాద్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నికల అధికారిగా అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి రాఘవేందర్ రెడ్డి, పరిశీలకులుగా శ్రీనివాసరెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ.. తొందర్లోనే మిగతా కార్యవర్గం ఎన్నుకుంటామన్నారు. ప్రైవేటు పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.