Homeజిల్లాలునిజామాబాద్​TNGOs Nizamabad | టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో జయశంకర్​కు ఘననివాళి

TNGOs Nizamabad | టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో జయశంకర్​కు ఘననివాళి

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: TNGOs Nizamabad | తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ (jayashankar) జయంతి సందర్భంగా ఆయనకు టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.

నగరంలోని కంఠేశ్వర్(Kanteshwar)​ సర్కిల్​లో ఉన్న జయశంకర్​ విగ్రహానికి బుధవారం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్ నాశెట్టి సుమన్​కుమార్(Nashetty Suman Kumar) పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవోస్​ రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా జాయింట్ సెక్రెటరీ జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, భీంగల్ యూనిట్ అధ్యక్షుడు సృజన్ కుమార్, ఎస్​అండ్​ఎల్​ఆర్​ స్పెషల్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు సూర్యప్రకాష్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.