HomeతెలంగాణMulugu | అటవీ శాఖ అధికారులపై గిరిజనుల దాడి

Mulugu | అటవీ శాఖ అధికారులపై గిరిజనుల దాడి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mulugu | అటవీశాఖ అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. ఈ ఘటన ములుగు(Mulugu) జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. ఏటూరునాగారం మండలం చల్పాకలోని అటవీ భూముల్లో కొందరు గిరిజనులు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. ఈ క్రమంలో గుడిసెలను తొలగించడానికి అటవీ శాఖ అధికారులు(Forest Department officers) సోమవారం పోలీసుల సాయంతో జేసీబీ, డోజర్లతో వెళ్లారు. దీంతో గిరిజనులు ఫారెస్ట్​ అధికారులు(Forest officers), పోలీసులపై తిరగబడ్డారు. కర్రలతో జేసీబీ, ట్రాక్టర్​(Tractor)పై దాడి చేశారు. అధికారులపై కారం చల్లి కర్రలతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.