Homeజిల్లాలుకామారెడ్డిJEE Advanced Results | జేఈఈ అడ్వాన్స్​లో మెరిసిన గిరిజన విద్యార్థులు

JEE Advanced Results | జేఈఈ అడ్వాన్స్​లో మెరిసిన గిరిజన విద్యార్థులు

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: JEE Advanced Results | నస్రుల్లాబాద్ మండలంలోని (Nasrullabad mandal) సంగెం తండా (Sangem Thanda) నుంచి జేఈఈ అడ్వాన్స్​లో ముగ్గురు గిరిజన విద్యార్థులు మెరిశారు. తండాకు చెందిన జరుపుల సుధాకర్ 177వ ర్యాంక్ సాధించాడు. మాలోత్ రవితేజ 509, నెనావత్ శేఖర్ 736 ర్యాంకులు సాధించి సత్తా చాటారు. సుధాకర్, రవితేజ ఇద్దరు నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్​ చదివారు. సుధాకర్ ఆల్​ ఇండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం గర్వకారణమని తండావాసులు సంతోషం వ్యక్తం చేశారు.