Homeజిల్లాలునిజామాబాద్​TRESA | కలెక్టర్​ను కలిసిన ట్రెసా ప్రతినిధులు

TRESA | కలెక్టర్​ను కలిసిన ట్రెసా ప్రతినిధులు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: TRESA | నిజామాబాద్​ కలెక్టర్​గా వినయ్​ కృష్ణారెడ్డి (Nizamabad Collector Vinay Krishna Reddy) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో అమలు చేస్తున్న భూభారతితో (Bhubarathi) పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామన్నారు. కలెక్టర్​ను కలిసిన వారిలో ట్రెసా (Telangana Revenue Employees Service Association) జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, కార్యదర్శి ప్రశాంత్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీనివాస్ రావు, భాస్కర్, నిజామాబాద్ నార్త్ మండల తహశీల్దార్ విజయ్​కాంత్ రావు తదితరులున్నారు.