3
అక్షరటుడే, డిచ్పల్లి : Dichpalli | డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారి (NH 44)పై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో బస్సులో ఉన్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది.
నిర్మల్ నుంచి హైదరాబాద్ (Hyderabad) వైపు వెళ్తున్న బస్సు సుద్దపల్లి సమీపంలో ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అజాగ్రత్త నడపడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉండగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న డిచ్పల్లి ఎస్సై షరీఫ్ (Dichpalli SI Sharif) ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించిన్నట్లు ఎస్సై తెలిపారు.