Homeఆంధప్రదేశ్Travel Bus Accident | మరో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ ట్రావెల్​ బస్సు

Travel Bus Accident | మరో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ ట్రావెల్​ బస్సు

Travel Bus Accident | ఆంధ్రప్రదేశ్​లో మరో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్ వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.

- Advertisement -

అక్షరటుడే, అమరావతి: Travel Bus Accident | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ​లోని కర్నూల్ Kurnool జిల్లాలో ఇటీవల ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ Vemuri Kaveri Travels బస్సులో మంటలు వ్యాపించి 19 మంది దుర్మరణం చెందారు.

ఈ దారుణ ఘటన మరువక ముందే ఆంధ్రప్రదేశ్​లో మరో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఏలూరు జిల్లా Eluru district లింగపాలెం మండలం జూబ్లీనగర్ వద్ద సోమవారం (నవంబరు 3) రాత్రి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.

ఈ విషాదకరమైన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. పలువురు ప్రయాణికులు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు భారతి ట్రావెల్స్​ (Bharathi Travels) కు చెందినదిగా గుర్తించారు. ప్రమాదం జరిగేటప్పుడు ట్రావెల్​  బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

Travel Bus Accident | హైదరాబాద్ వస్తుండగా..

ఏలూరు నుంచి హైదరాబాద్ Hyderabad వస్తుండగా సదరు బస్సు ప్రమాదానికి గురైంది. కాగా, ప్రయాణికులు తీవ్రంగా గాయపడినందున మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.