Homeజిల్లాలుకామారెడ్డిTransport Department | రవాణా శాఖ చెక్​పోస్టుల మూసివేత: సిబ్బంది కార్యాలయంలో రిపోర్ట్​ చేయాలని ఆదేశాలు

Transport Department | రవాణా శాఖ చెక్​పోస్టుల మూసివేత: సిబ్బంది కార్యాలయంలో రిపోర్ట్​ చేయాలని ఆదేశాలు

రవాణా శాఖ చెక్​పోస్టులను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉమ్మడిజిల్లాలో మూడు చెక్​పోస్టులను మూసివేస్తున్నట్లు డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ దుర్గాప్రమీల పేర్కొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Transport Department | రవాణా శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంతర్రాష్ట్ర చెక్​పోస్టులు (inter-state checkposts) మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మేరకు చెక్​ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని రవాణా శాఖ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్ దుర్గాప్రమీల (Deputy Transport Commissioner Durga Pramila) ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా చెక్​పోస్ట్ వద్ద ఉన్న ఫర్నిచర్, రశీదులు, పరికరాలు కంప్యూటర్లను కార్యాలయంలో అప్పజెప్పాలని పేర్కొన్నారు.

Transport Department | ఇకపై ఆన్​లైన్​లో అనుమతులు..

అంతర్రాష్ట్ర అనుమతులకు సంబంధించిన సేవల కోసం ఇకపై ఆన్​లైన్​లోనే దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్ పేర్కొన్నారు. అలాగే చెక్​పోస్టుల (check posts) వద్ద భారీకేడ్లు, బోర్డులు తొలగించి, సేవలకు సంబంధించిన లభ్యత వివరాలను ప్రదర్శించాలని సిబ్బందికి ఆదేశించారు. ఇకపై చెక్​పోస్టుల సేవలను www.transport.telangana.govin వెబ్​సైట్​ ద్వారా పొందవచ్చని సూచించారు. చెక్​పోస్టుల్లో వాహనాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని, భౌతిక అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. ఉమ్మడిజిల్లాలో మూడు చెక్​పోస్టులు ఉన్నాయి.