అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | జీవితంపై విరక్తి చెంది ఓ ట్రాన్స్జెండర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలో ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సాయిరెడ్డి (Sub-Inspector Sai Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన ట్రాన్స్జెండర్ మీర కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
దీంతో జీవితంపై విరక్తి చెందిన మీరా మంగళవారం నిజామాబాద్–జానకంపేట్ (Nizamabad-Janakampet) రైల్వేస్టేషన్ వద్ద గుర్తు తెలియని రైలుకు అడ్డువెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు రైల్వే పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.