అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: SI Transfers | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైల బదిలీలు జరిగాయి. ఈ మేరకు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
మొత్తం తొమ్మిది మందిని ట్రాన్స్ఫర్ చేశారు. ఇందులో భాగంగా.. టి.గోవింద్ను ఆర్మూర్ నుంచి సీసీఎస్ నిజామాబాద్కు పంపించారు. సిలివేరి మహేష్ను నిజామాబాద్ నాల్గో టౌన్ (Nizamabad Fourth Town) నుంచి సీసీఎస్ నిజామాబాద్కు బదిలీ చేశారు. గంగుల మహేష్ను వీఆర్ నుంచి సీసీఎస్ నిజామాబాద్కు అటాచ్ చేశారు. గురుక మహేష్ను వీఆర్ నుంచి ఒకటో టౌన్ పీఎస్కు ట్రాన్స్ఫర్ చేశారు.
సామ శ్రీనివాస్ను సౌత్ రూరల్ నుంచి నిజామాబాద్ రూరల్ ఎస్సై–2గా బదిలీ చేశారు. మొగులయ్యను ఒకటో టౌన్ నుంచి మాక్లూర్ పీఎస్ రెండో ఎస్సై–2గా పంపించారు. వీఆర్లో ఉన్న కె.వినయ్కుమార్ను ఆర్మూర్ పీఎస్కు బదిలీ చేశారు. సాయన్ గౌడ్ను వీఆర్ నుంచి సీఎస్బీ నిజామాబాద్కు ట్రాన్స్ఫర్ చేశారు. వీఆర్లో ఉన్న బీబీఎస్ రాజును కలెక్టరేట్కు అటాచ్ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే తమకు కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.