HomeతెలంగాణIAS Transfers | పలువురు ఐఏఎస్​ల బదిలీ

IAS Transfers | పలువురు ఐఏఎస్​ల బదిలీ

రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్​ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Transfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్​లు (IAS) బదిలీ అయ్యారు. 8 మంది అధికారులకు స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అభివృద్ధి సంక్షేమ పథకాల స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా సభ్యసాచి ఘోష్, రవాణా శాఖ కమిషనర్ గా ఇలాంబర్తి నియమితులయ్యారు. జీఏడీ పొలిటికల్ ఇన్​ఛార్జి సెక్రెటరీగా ఈ శ్రీధర్, గురుకుల సంక్షేమ కమిషనర్​గా అనితా రామచంద్రన్​ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్​మెంట్​ ఇన్​ఛార్జి సెక్రెటరీగా సీఎస్​ రామకృష్ణారావుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయిల్​ ఫెడ్ ఎండీగా యాస్మిన్ భాష, ఎస్సీ డెవలప్మెంట్ స్పెషల్ కమిషనర్​గా జితేందర్ రెడ్డి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రత్యేక కార్యదర్శిగా సైదులకు ఇన్​ఛార్జి బాధ్యతలు అప్పగించింది.