HomeతెలంగాణACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రాన్స్​ డీఈ

ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రాన్స్​ డీఈ

మెదక్​ ట్రాన్స్​ డీఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కోళ్ల ఫారానికి విద్యుత్​ కనెక్షన్​ ఇవ్వడానికి ఆయన రూ.30 వేలు డిమాండ్​ చేశాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు ఏ మాత్రం మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు జరుగతున్నా.. భయపడకుండా లంచాలు తీసుకుంటున్నారు. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. కొందరు అధికారులైతే లంచం తీసుకోవడం హక్కుగా భావిస్తున్నారు. తాజాగా ఏసీబీ అధికారులు మెదక్​ ట్రాన్స్​కో డీఈ (Medak Transco DE) మహమ్మద్ షరీఫ్ ఖాన్​ను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

మెదక్​ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్​కో కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేపట్టారు. పాపన్నపేట (Papannapet) మండలం సీతానగరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేశాడు. దానికి విద్యుత్ కనెక్షన్​ ఇవ్వడానికి డీఈ మహమ్మద్ షరీఫ్ ఖాన్ రూ.40 వేల లంచం డిమాండ్​ చేశాడు. బాధితుడు బతిమిలాడటంతో రూ.30 వేలు తీసుకోవడానికి అంగీకరించాడు. ఇప్పటికే రూ.9 వేలు ఇచ్చాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో గురువారం రూ.21 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు డీఈ మహమ్మద్ షరీఫ్ ఖాన్​ను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టారు.

ACB Raid | విద్యుత్​ శాఖలో జోరుగా అవినీతి

విద్యుత్​ శాఖలో అవినీతి జోరుగా సాగుతోంది. లైన్​మన్​ స్థాయి నుంచి డీఈల వరకు లంచాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఏసీబీ దాడుల్లో విద్యుత్​ శాఖ అధికారులు ఎక్కువగా పట్టుబడుతుండటం గమనార్హం. యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆహార యంత్రాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ప్రాసెస్​ చేయడానికి రూ.1,90,000 లంచం తీసుకుంటూ విద్యుత్​ శాఖ ఏఈ, దేవాదాయ శాఖలోని ఇన్​ఛార్జి సూపరింటెండింగ్ ఇంజినీరు వూడెపు వెంకట రామారావు బుధవారం ఏసీబీకి దొరికాడు. హైదరాబాద్ (Hyderabad)​ పెద్ద అంబర్‌పేట్‌లోగల సహాయక ఇంజినీరు(ఆపరేషన్స్) కార్యాలయంలోని లైన్ ఇన్‌స్పెక్టర్ ప్రభులాల్​ను సైతం బుధవారం అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.