అక్షరటుడే, వెబ్డెస్క్ : Nizamabad | ఆభరణాల తయారీపై నగరంలోని స్వర్ణకారులకు శిక్షణ ఇస్తున్నట్లు విశ్వబ్రాహ్మణ నగర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు గుత్ప సదానంద తెలిపారు. స్వర్ణకారులు హెచ్యూఐడీ హాల్ మార్కింగ్ (Hallmarking) ఆభరణాలు తయారు చేసే విధంగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ నగర స్వర్ణకార సంఘం, నిజామాబాద్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని మర్వాడిగల్లిలో గల ధర్మకాంట కాంప్లెక్స్లో గురువారం, శుక్రవారం శిక్షణ ఉంటుందన్నారు. స్వర్ణకారులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
