Bharath Electronic Jobs | భారత్‌ ఎలక్ట్రానిక్స్‌లో ట్రైనీ ఇంజినీర్‌ కొలువులు.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వ రంగ సంస్థ

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bharath Electronic Jobs | బెంగళూరుకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (Bharat Electronics Ltd) తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజినీర్‌, ట్రైనీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని కోట్‌ద్వార్‌ యూనిట్‌లో పనిచేయడానికి ఆసక్తిగలవారినుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌ వివరాలిలా ఉన్నాయి. Bharath Electronic Jobs | పోస్టుల వారీగా వివరాలు.. భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 51. ట్రైనీ ఇంజినీర్‌-1 […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bharath Electronic Jobs | బెంగళూరుకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (Bharat Electronics Ltd) తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజినీర్‌, ట్రైనీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని కోట్‌ద్వార్‌ యూనిట్‌లో పనిచేయడానికి ఆసక్తిగలవారినుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌ వివరాలిలా ఉన్నాయి.

Bharath Electronic Jobs | పోస్టుల వారీగా వివరాలు..

భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 51.

ట్రైనీ ఇంజినీర్‌-1 : 50 (ఇందులో ఎలక్ట్రానిక్స్‌ 30, మెకానికల్‌ 17, ఎలక్ట్రికల్‌ 01, సివిల్‌ 02 పోస్టులున్నాయి)
ట్రైనీ ఆఫీసర్‌-1(ఫైనాన్స్‌) : 01.

విద్యార్హత : ట్రైనీ ఇంజినీర్‌ (Trainee Engineer)కు పోస్టుకు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తిచేసినవారు, ట్రైనీ ఆఫీసర్‌(Trainee Officer)కు ఎంబీఏ/ఎంకాం ఉత్తీర్ణులు అర్హులు.

వయోపరిమితి : 28 ఏళ్లలోపు వారు అర్హులు.

వేతనం : నెలకు మొదటి ఏడాది రూ. 30 వేలు, రెండో ఏడాది రూ. 35 వేలు, మూడో ఏడాది రూ. 40 వేలు.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు రుసుము : రూ.150. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు గడువు తేదీ : జనవరి 15.

ఎంపిక విధానం : విద్యార్హతలు, ఇంటర్వ్యూ/రాత పరీక్ష ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష/ఇంటర్వ్యూ తేదీ : జనవరి 25.
ఇంటర్వ్యూ వేదిక : ఉత్తరాఖండ్‌లోని కొట్‌ద్వార్‌, పారీ గర్వాల్‌ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ యూనిట్‌

పూర్తి వివరాలకు https://bel-india.in వెబ్‌సైట్‌లో సంప్రదించగలరు.

Related articles

Exam Center Security | పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ రాజేష్ చంద్ర

పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

TTD Digital Offerings | తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కొత్త నిర్ణయం.. ‘శ్రీవారి ముడుపు పత్రం’తో డిజిటల్ కానుకల సౌకర్యం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు డిజిటల్ రూపంలో హుండీ కానుకలు సమర్పించేందుకు టీటీడీ ‘శ్రీవారి ముడుపు పత్రం’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించి ప్రత్యేక పత్రాన్ని హుండీలో వేయే సౌకర్యం కల్పించనుంది.

Tirumala Ghat Road Accident | తిరుమల ఘాట్​ రోడ్డులో ప్రమాదం.. ఒకరి మృతి

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన భక్తుడు మృతి చెందాడు.

Armur Municipal Council | ఆర్మూర్​ బల్దియా పాలకవర్గం బాధ్యతల స్వీకరణ

ఆర్మూర్​ మున్సిపల్ పాలకవర్గం గురువారం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్​పర్సన్​గా గోనె లహరి, వైస్ ఛైర్మన్​గా కాటిపల్లి వెంకటరెడ్డితో పాటు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు.