అక్షరటుడే, వెబ్డెస్క్ : Train Accident | ఒడిశాలో రైలు ప్రమాదం(Train Accident Odisha) చోటు చేసుకుంది. సంబల్పూర్లోని తంగర్పాలి సమీపంలో షాలిమార్-సంబల్పూర్ రైలు చివరి కోచ్ పట్టాలు తప్పింది. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
రైలు చివరి కోచ్ పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే పోలీసులు(Railway Police), అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు(Railway Officers) దర్యాప్తు జరుపుతున్నారు.
Train Accident | నెమ్మదిగా వెళ్తుండటంతో
సంబల్పూర్ సిటీ స్టేషన్((Sambalpur City Station) సమీపంలో షాలిమార్-సంబల్పూర్ మహిమా గోసైన్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పినట్లు తూర్పు కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. రైలు గార్డు వ్యాన్(Train Guard Van) పక్కన ఉన్న జనరల్ కోచ్ వెనుక ట్రాలీ పట్టాలు తప్పిందన్నారు. ఆ సమయంలో చాలా నెమ్మదిగా వెళ్తుండటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. లేదంటే మిగతా కోచ్లు కూడా పట్టాలు తప్పే అవకాశం ఉందన్నారు. అయితే పట్టాలు తప్పడానికి గల కారణాలను ఇంకా తెలియరాలేదు. అనంతరం ఆ కోచ్ను తొలగించి మిగతా రైలును యథావిథిగా పంపించారు.