ePaper
More
    HomeతెలంగాణHyderabad | మియాపూర్​లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

    Hyderabad | మియాపూర్​లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​ నగరంలోని (Hyderabad city) మియాపూర్​లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

    కర్నాటకలోని (Karnataka) గుల్బర్గాకు చెందిన లక్ష్మయ్య (60), వెంకటమ్మ (55) దంపతులు. వీరికి అల్లుడు అనిల్ (40), కుమార్తె కవిత (38) ఉన్నారు. అనిల్, కవితకు రెండేళ్ల కూతురు ఉంది. వీరు కొంత కాలంగా మియాపూర్​లోని మక్తా మహబూబ్‌పేటలో నివాసం ఉంటున్నారు. బుధవారం అర్ధరాత్రి వీరు మృతి చెందారు. గురువారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

    Hyderabad | ఆత్మహత్యగా అనుమానం

    ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందిన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ముందు చిన్నారిని హత్య చేసి మిగతా నలుగురు విషం తీసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు (Case registered) చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    Latest articles

    Kamareddy Collector | మున్సిపాలిటీలో డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా చర్యలు తీసుకోవాలి

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Collector | మున్సిపాలిటీలో ఎక్కడ కూడా డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని...

    Delhi CM | కుక్క‌ల కోసమే సీఎంపై దాడి చేసా.. నిందితుడు షాకింగ్ కామెంట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడికి పాల్పడిన రాజేష్ ఖిమ్జీ...

    Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి దిగువకు నీటి విడుదల...

    Jagadeesh Reddy | క‌మీష‌న్ల కోస‌మే యూరియా కొర‌త‌.. కాంగ్రెస్ చేత‌గానిత‌నంతోనే రైతుల‌కు క‌ష్టాలన్న జ‌గ‌దీష్‌రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jagadeesh Reddy | కాంగ్రెస్ ప్ర‌భుత్వ చేత‌గానితనంతోనే యూరియా కొర‌త ఏర్ప‌డింద‌ని మాజీ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి...

    More like this

    Kamareddy Collector | మున్సిపాలిటీలో డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా చర్యలు తీసుకోవాలి

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Collector | మున్సిపాలిటీలో ఎక్కడ కూడా డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని...

    Delhi CM | కుక్క‌ల కోసమే సీఎంపై దాడి చేసా.. నిందితుడు షాకింగ్ కామెంట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడికి పాల్పడిన రాజేష్ ఖిమ్జీ...

    Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి దిగువకు నీటి విడుదల...