Homeక్రైంMedchal | మేడ్చల్​ జిల్లాలో విషాదం.. ట్యాంకర్​ ఢీకొని ఏఎస్సై మృతి

Medchal | మేడ్చల్​ జిల్లాలో విషాదం.. ట్యాంకర్​ ఢీకొని ఏఎస్సై మృతి

వాటర్​ ట్యాంకర్​ ఢీకొని ఏఎస్సై మృతి చెందాడు. ఈ ఘటన పేట్​ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో శనివారం చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Medchal | మేడ్చల్ జిల్లాలో (Medchal district) విషాదం చోటు చేసుకుంది. వాటర్​ ట్యాంకర్​ (water tanker) ఢీకొని ఏఎస్సై మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా (Vikarabad district) పెద్దముల్‌కు చెందిన దేవిసింగ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్నాడు.

శనివారం ఆయన విధులకు హాజరయ్యాడు. స్టేషన్​ ఆవరణలో నిలబడి ఉండగా.. ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకర్ వాహనం ఆయనను ఢీకొంది. శనివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన దేవిసింగ్​ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Must Read
Related News