అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ నగరంలో పండుగ పూట విషాదం నెలకొంది. వినాయక్ నగర్ (Vinayak Nagar)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.
నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ (SI Srikanth) తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ (Mopal) మండలం కంజర గ్రామానికి చెందిన దొంతుల అరుణ్ కుమార్ (40) సోమవారం తెల్లవారుజామున బైక్పై వెళ్తున్నాడు. నగరంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో బోర్గాం వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు అరుణ్ బైక్ను ఢీకొంది. కారు డ్రైవర్ అజాగ్రత్తతో నడపడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అరుణ్కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.