HomeతెలంగాణMIM Nizamabad | బోధన్​ రోడ్డు​లో ట్రాఫిక్​ సిగ్నళ్లు​ ఏర్పాటు చేయాలి

MIM Nizamabad | బోధన్​ రోడ్డు​లో ట్రాఫిక్​ సిగ్నళ్లు​ ఏర్పాటు చేయాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: MIM Nizamabad | నగరంలోని బోధన్​ బస్టాండ్​ నుంచి అర్సపల్లి మధ్యలో ట్రాఫిక్​ సిగ్నల్స్​ ఏర్పాటు చేయాలని ఎంఐఎం నాయకులు పేర్కొన్నారు. గురువారం ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీకి(Traffic ACP Mastan Ali) వినతిపత్రం అందజేశారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజుద్దీన్​ (MIM district president Fayazuddin) మాట్లాడుతూ.. విపరీతమైన ట్రాఫిక్​ కారణంగా బోధన్​ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారన్నారు. బోధన్​ బస్టాండ్​, మాలపల్లి ఎక్స్​ రోడ్​, ధర్మకాంట సమీపంలో, అర్సపల్లి ఎక్స్​ రోడ్​ ప్రాంతాల్లో ట్రాఫిక్​ సిగ్నళ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని వారు కోరారు. అలాగే బోధన్​ రోడ్​, ఖిల్లారోడ్​లో స్కూళ్లు, మసీదులు ఉన్న చోట్ల జీబ్రా క్రాసింగ్​ ఏర్పాటు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో పలువురు ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు.