Homeజిల్లాలుహైదరాబాద్Hyderabad | హైదరాబాద్​లో ఐదు రోజుల పాటు ట్రాఫిక్​ ఆంక్షలు.. ఎందుకో తెలుసా?

Hyderabad | హైదరాబాద్​లో ఐదు రోజుల పాటు ట్రాఫిక్​ ఆంక్షలు.. ఎందుకో తెలుసా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | వినాయక చవితి (Ganesha Chavithi) వచ్చిందంటే హైదరాబాద్ నగరంలో (Hyderabad City) సందడి మాములుగా ఉండదు. భారీ విగ్రహాల తరలింపు నుంచి మొదలు పెడితే నిమజ్జనం వరకు భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ఎక్కడ చూసినా గణపతి విగ్రహాలే కనిపిస్తాయి.

వినాయక చవితి సమీపిస్తుండడంతో మండపాల్లో ప్రతిష్ఠించడానికి విగ్రహాలను తీసుకు వెళ్తున్నారు. నగరంలోని ధూల్​పేట వినాయక విగ్రహాల తయారీకి పేరుగాంచింది. ఈ ప్రాంతం నుంచి భారీ విగ్రహాలను నగరం నలుమూలలతో పాటు ఇతర జిల్లాలకు సైతం తీసుకు వెళ్తారు. భారీ వినాయక విగ్రహాలు (Ganesha idols) తీసుకు వెళ్లే సమయంలో ట్రాఫిక్​ జామ్​ అయి వాహనదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ట్రాఫిక్​ పోలీసులు (Traffic Police) కీలక చర్యలు చేపట్టారు. ధూల్​పేట (Dhulpeta) ప్రాంతంలో ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు.

Hyderabad | ట్రాఫిక్ మళ్లింపులు

ధూల్‌పేట్ ప్రాంతం నుంచి గణేష్ విగ్రహాల అమ్మకం, కొనుగోలు మరియు రవాణా దృష్ట్యా ఈ నెల 23న ఉదయం 7 గంటల నుంచి 27న రాత్రి పది గంటలకు వరకు ట్రాఫిక్​ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఆ రోజుల్లో బోయిగూడ కమాన్, గాంధీ విగ్రహం మధ్య (రెండు దిశలలో) సాధారణ ట్రాఫిక్ అనుమతించారు. గణేష్ విగ్రహాలను తీసుకు వెళ్లే వాహనాలు గాంధీ విగ్రహం, పురానాపూల్ నుంచి ప్రవేశించి బోయిగూడ కమాన్ X రోడ్ల మీదుగా బయటకు వెళ్లాయి.

గాంధీ విగ్రహం, పురానాపూల్ ‌‌– మంగళ్‌హాట్ నుంచి సాధారణ ట్రాఫిక్‌ను టక్కర్‌వాడి టి జంక్షన్ మీదుగా జిన్సి చౌరాహి, ఘోడే-కే-ఖబర్ ద్వారా మళ్లిస్తారు. సీతారాంబాగ్ మీదుగా మంగళ్‌హాట్/పురానాపూల్ నుంచి వచ్చే ట్రాఫిక్ బోయిగూడ కమాన్ ఎక్స్ రోడ్డువైపు మళ్లిస్తారు. కార్వాన్ రోడ్ నుంచి పురానాపూల్ X రోడ్, గాంధీ విగ్రహం లేదా అఘాపురా, దారుస్సలాం, అలాస్కా, MJ వంతెన, జుమీరత్ బజార్, పురానాపూల్ మీదుగా వాహనాలను మళ్లిస్తారు.

దారుస్సలాం నుంచి పురానాపూల్ నుంచి మంగళ్‌హాట్ మీదుగా వచ్చే ట్రాఫిక్ బోయిగూడ కమాన్, అఘపురా, జిన్సీ చౌరాహి, జుమ్మెరత్ బజార్, పురానాపూల్ వద్ద మళ్లిస్తారు.

Hyderabad | పార్కింగ్​ అక్కడే..

గణేశ్​ విగ్రహాలను రవాణా చేసే అన్ని లారీలు/డీసీఎంలను జుమ్మెరత్ బజార్ గ్రౌండ్‌లో పార్క్ చేయాలి. విగ్రహాలను తీసుకు వెళ్లడానికి రాత్రి 10 గంటల తర్వాత మాత్రమే అనుమతిస్తారు. భారీ వర్షాలు కురిస్తే MJ బ్రిడ్జి నుంచి జుమ్మెరత్ బజార్ రోడ్డు వైపు, జుమ్మెరత్ బజార్ పార్కింగ్ ఏరియా వరకు వాహనాలను ఒకే లైన్‌లో నిలిపివేస్తారు. ప్రజలు తమకు సహకరించాలని పోలీసులు కోరారు.