ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | విద్యుత్​స్తంభాలు తీసుకెళ్తుండగా ట్రాక్టర్​ బోల్తా.. ఇద్దరి దుర్మరణం

    Bodhan | విద్యుత్​స్తంభాలు తీసుకెళ్తుండగా ట్రాక్టర్​ బోల్తా.. ఇద్దరి దుర్మరణం

    Published on

    అక్షరటుడే, బోధన్: Bodhan | విద్యుత్​ స్తంభాలు మీదపడి ఇద్దరు జీపీ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన బోధన్​ మండలంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్​ మండలం బిక్నెల్లికి (Biknelly) చెందిన బాలాజీ, యాదుతో పాటు రాజు గ్రామ పంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్నారు.

    ఇటీవల కురిసిన వర్షాలకు విరిగిపోయిన విద్యుత్​ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు ఈ ముగ్గురు బయలుదేరారు. కల్దుర్కి సబ్​స్టేషన్ (Kaldurki Substation)​ నుంచి విద్యుత్​ స్తంభాలను తీసుకెళ్తుండగా.. సిద్ధాపూర్(Siddhapur)​ వద్ద ట్రాక్టర్​ బోల్తా పడింది. ట్రాక్టర్​ డ్రైవర్​ రాజు స్వల్ప గాయాలతో బయటపడగా.. ట్రాక్టర్​పై ఉన్న బాలాజీ, యాదులపై ట్రాక్టర్​ బోల్తా పడింది. దీంతో వారిరువురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవల్లో కీలక మార్పులు రానున్నాయి....

    Sharper Mind | మతిమరుపుతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే పాదరసంలాంటి మెదడు మీసొంతం

    అక్షరటుడే, హైదరాబాద్ : Sharper Mind | మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడిన పనుల వల్ల చాలా మంది...

    Collectorate building collapses | ఆదిలాబాద్​లో భారీ వ‌ర్షం.. కుప్ప‌కూలిన క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Collectorate building collapses : ఆదిలాబాద్​ Adilabad లో భారీ వర్షం దంచికొడుతోంది. గురువారం (సెప్టెంబరు...