ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | విపత్తు సమయాల్లో సమర్థవంతంగా సేవలందించాలి

    Nizamabad | విపత్తు సమయాల్లో సమర్థవంతంగా సేవలందించాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో తక్షణసాయం అందించేలా ఆపదమిత్రలు సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ ప్రేమ్ కుమార్ (Additional Collector Prem Kumar) సూచించారు.

    మాస్టర్ ట్రైనర్లుగా (Master Trainers) శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు ఆపదమిత్ర (Apadamitra) వలంటీర్లు బుధవారం జిల్లా కలెక్టరేట్​లో అదనపు కలెక్టర్​ను కలిశారు. జిల్లాలో 300మంది ఆపదమిత్ర వలంటీర్లు మొదటి విడత శిక్షణ పూర్తి చేసుకోగా.. ఐదుగురిని మాస్టర్ ట్రెయినింగ్​ కోసం ఎంపిక చేసి బెంగళూరులోని ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అకాడమీలో 21 రోజులు మెరుగైన శిక్షణ అందించారు.

    జిల్లా నుంచి శిక్షణ పొందిన సురేఖ, జమున, రాజు, వెంకటేష్, సునీల్​లను అదనపు కలెక్టర్ అభినందించారు. ట్రెయినింగ్​ పూర్తి చేసుకున్న వలంటీర్లు మిగతా వలంటీర్లకు విపత్తు సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా నివారించాలనే అంశాలపై మెళకువలు తెలపాలని సూచించారు.

    More like this

    Diabetes | షుగర్ వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Diabetes | షుగర్ వ్యాధి (Diabetes) పట్ల పలు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని...

    Care Degree College | 12న కేర్ డిగ్రీ కళాశాలలో రిక్రూట్ మెంట్ డ్రైవ్

    అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న రిక్రూట్ మెంట్...

    Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శిని బదిలీ చేయొద్దు

    అక్షరటుడే, బోధన్: Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శి ఉమాకాంత్ బదిలీ ఉత్తర్వులు నిలిపేసి యధాస్థానంలో కొనసాగించాలని...