Homeజిల్లాలుకామారెడ్డిThunderstorm | ఇంటిపై పడిన పిడుగు.. చెడిపోయిన విద్యుత్ ఉపకరణాలు

Thunderstorm | ఇంటిపై పడిన పిడుగు.. చెడిపోయిన విద్యుత్ ఉపకరణాలు

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Thunderstorm | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో వర్ని మండల కేంద్రంలో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఓ ఇంటిపై పిడుగు పడింది. మండల కేంద్రంలోని మెహర్ బాబా కాలనీలో నివాసం ఉంటున్న శివకుమార్ భవనం పిల్లర్​పై పిడుగు పడింది. దీంతో పిల్లర్ పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లోని విద్యుత్ మీటర్​ కాలిపోగా.. ఇతర విద్యుత్తు ఉపకరణాలు చెడిపోయాయి. చుట్టుపక్కల నాలుగు ఇళ్లలో కూడా విద్యుత్ ఉపకరణాలు చెడిపోయినట్లు స్థానికులు తెలిపారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవగా పడి పిడుగు పడింది.