HomeUncategorizedHeavy Rains | కొండచరియలు పడి ముగ్గురు సైనికుల మృతి

Heavy Rains | కొండచరియలు పడి ముగ్గురు సైనికుల మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Heavy Rains | కొండ చరియలు విరిగి పడటంతో ముగ్గురు సైనికులు(Soldiers) మృతి చెందారు. ఈ ఘటన సిక్కిం(Sikkim) రాష్ట్రంలో చోటు చేసుకుంది.

గత కొద్ది రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలకు (Heavy Rains) సిక్కింలోని ఛటేన్‌ ప్రాంతంలో మిలిటరీ క్యాంప్‌(Military camp)పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించగా.. మరో ఆరుగురు గల్లంతయ్యారు. ముగ్గురి మృతదేహాలను బలగాలు గుర్తించాయి. ఈ ప్రమాదం నుంచి మరో నలుగురు సిబ్బంది బయటపడ్డారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

Heavy Rains | రెడ్​ అలెర్ట్​ జారీ

ఈశాన్య రాష్ట్రాల్లో సోమవారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు రెడ్​ అలెర్ట్(Red Alert)​ జారీ చేశారు. అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, మణిపుర్‌, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్​లో అతి భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ప్రభావం, అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వానల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.