ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | దాడి కేసులో ముగ్గురికి రెండేళ్ల జైలు

    Banswada | దాడి కేసులో ముగ్గురికి రెండేళ్ల జైలు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | క్షుద్రపూజల నెపంతో ఇద్దరిపై దాడికి పాల్పడిన కేసులో ముగ్గురికి న్యాయస్థానం రెండేళ్ల జైలుశిక్ష విధించినట్లు వర్ని ఎస్సై మహేశ్‌ (varni SI Mahesh) తెలిపారు. వర్ని మండలం సిద్దాపూర్‌ తండాకు చెందిన మానిక్‌ చంద్, పద్మ క్షుద్రపూజలు చేస్తున్నారన్న కారణంతో అదే గ్రామానికి చెందిన దౌలత్‌ రావు, సరిచంద్, శంకర్‌ వారిపై దాడి చేశారు. దీంతో అప్పటి ఎస్సై అంజయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో బోధన్‌ కోర్టు అడిషనల్‌ జడ్జి సాయిశివ మంగళవారం ముగ్గురు ముద్దాయిలకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్సై తెలిపారు.

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...