అక్షరటుడే, ఇందూరు: Nizamabad City| నగరంలోని శివాజీనగర్లో (Shivajinagar) ముగ్గురు కుటుంబ సభ్యులు గడ్డిమందు తాగిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది.
స్పందించిన స్థానికులు వెంటనే ఈ ముగ్గురికి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి (private hospital) తరలించారు. అక్కడ ఇంటిపెద్ద దాసరి కిషన్ మృతి చెందాడు. ఆయన భార్య నాగమణి, కొడుకు వంశీని హైదరాబాద్లోని (Hyderabad) నిమ్స్కు రిఫర్ చేశారు.
Nizamabad City | చికిత్స పొందుతూ..
అయితే చికిత్స పొందుతున్న ఇద్దరిలో కొడుకు వంశీ శుక్రవారం మృతి చెందాడు. తల్లి సైతం వెంటిలేటర్పై చికిత్స పొందుతోందని స్థానికులు పేర్కొన్నారు. ఇంట్లో గొడవల కారణంగా కొడుకు ముందుగా గడ్డిమందు తాగగా.. తల్లీతండ్రి సైతం మందు తాగారని స్థానికులు వివరించారు.
